కోపంతో ట్రిప్స్ బుకింగ్.. యువత కొత్త ట్రెండ్

1898చూసినవారు
కోపంతో ట్రిప్స్ బుకింగ్.. యువత కొత్త ట్రెండ్
ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి, జీవితంలోని చిరాకుల వల్ల వచ్చే కోపాన్ని తగ్గించుకోవడానికి యువత వెంటనే ట్రిప్స్ బుక్ చేసుకుంటున్నారు. దీనినే 'రేజ్ బుకింగ్' అంటారు. జెన్-జీ, మిలీనియల్స్ ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం, మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ప్రయాణమే ఉత్తమ మార్గమని వారు భావిస్తున్నారు. అయితే, కోపంలో తీసుకునే ఈ నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చని, బడ్జెట్‌కు మించిన ట్రిప్స్ బుక్ చేసుకోకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్