AP: 2024 ఎన్నికల్లో మాజీ ఎంపీ బొత్స ఝాన్సీరాణి విశాఖ పార్లమెంట్కు పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత పూర్తిగా రాజకీయ కార్యకలాపాలను తగ్గించేశారు. మళ్లీ ఇప్పుడు ఆమె రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే విశాఖ పార్లమెంట్ సీటుకు ఇన్ఛార్జ్గా బొత్స ఝాన్సీ కొనసాగుతున్నారు. బొత్స ఝాన్సీ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిలి, విజయనగరం నుంచి ఎంపీగా రెండు సార్లు గెలిచారు. 2019లో వైసీపీలో చేరి విజయనగరం ఎంపీ సీటు ఆశించారు. కానీ ఆమెకు దొరకలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీకి మళ్లీ విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేయబోతున్నారని సమాచారం.