AP: గుంటూరు జిల్లా తుళ్ళూరులో బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు బ్లేడుతో దాడి చేశారు. రాత్రి 10:30 గంటల సమయంలో కిరాణా షాపుకు వచ్చిన దాసరి రామ సంతోష్ను ATMలో డబ్బులు డ్రా చేయాలని గుర్తు తెలియని వ్యక్తులు పిలిచి ఈ దాడికి పాల్పడ్డారు. ATM దగ్గరికి వెళ్లే సమయంలో రామ సంతోష్కు ద్విచక్ర వాహనం తాళాలు ఇవ్వాలని బెదిరించి.. వెంట తెచ్చుకున్న బ్లేడుతో సంతోష్ పై దాడి చేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.