మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తాజాగా దారుణ ఘటన వెలుగుచూసింది. కన్హన్ నది వంతెనపై జరిగిన అశ్విని (29) యువతి హత్యకు గురైంది. ఈ కేసులో 9 నిమిషాల సీసీటీవీ ఫుటేజ్, రైల్వే ట్రాక్మ్యాన్ సాక్ష్యం అత్యంత కీలకంగా మారాయి. పెళ్లి చేసుకోవాలని, ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ కావాలని కోరినందుకే ఆమె ప్రియుడు అశిష్ ఉరఫ్ మోను నదిలోని రాళ్లపైకి తోసేసి చంపేశాడు. హత్య తర్వాత పరారైన నిందితుడిని పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు.