తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈరోజు సాయంత్రం క్రీడా పోటీలు జరగనున్నాయి. అయితే, ఈ పోటీలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ, మత్తు వదిలించుకోవడానికి మైదానంలోకి రావాలని ఆయన ఆహ్వానించారు. కేటీఆర్ మైదానంలోకి రామని అంటే ఏం చేయగలమని ప్రశ్నించారు. తమ ఆటలు వేరు, కేటీఆర్ ఆటలు వేరు అని వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు.