AP: కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు వ్యవసాయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనేది సరికాదని, దీనికి పంజాబ్ను కేసు స్టడీగా తీసుకోవాలని సూచించారు. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలని తెలిపారు. ఏపీలో క్యాన్సర్ టాప్ 5 స్థానంలో ఉందని, ఇలాగే కొనసాగితే ప్రథమ స్థానంలోకి వెళ్తామని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది నుంచైనా యూరియాను బ్యాలెన్స్డ్గా వాడాలని ఆయన పిలుపునిచ్చారు.