TG: సంగారెడ్డి జిల్లా, పంచగామలోని విఠలేశ్వర ఆలయ పరిసరాల్లోని భూముల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సాగు జరుగుతున్నట్లు సమాచారం. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు 15 కిలోల ఎండు గంజాయితో పాటు 600 గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. ఈ గంజాయి సాగులో ఓ స్వామీజీ ప్రమేయం ఉన్నట్లు సమాచారం అందడంతో, ఎక్సైజ్ పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు.