TG: హైదరాబాద్ వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి, బైక్ను ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు స్పాట్లోనే చనిపోయారు. మృతి చెందిన వారు ఇంజినీరింగ్ ECE సెకండ్ ఇయర్ చదువుతున్న శివ, సందీప్ జోహెల్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.