ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో వివాహ విందులో మేక మాంసం వడ్డించలేదన్న కోపంతో నలుగురు మైనర్లు కేటరింగ్ సిబ్బందిపై కత్తులతో దాడి చేశారు. చికెన్ వడ్డించడంతో ఆగ్రహించిన యువకులు ఒకరిని తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని కటక్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నలుగురు నిందితులను అంగుల్ జువైనల్ హోంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.