ప్రధాని
మోదీ పోస్టును తొలగించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మెటా గ్లోబల్ బృందానికి కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5, 6 తేదీల్లో విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. కంటెంట్ మోడరేషన్ విధానాలపై వివరణ కోరుతూ, భారత చట్టాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. డీప్ఫేక్స్ నివారణపై కూడా కంపెనీని ప్రశ్నించనుంది. ఈ విచారణలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్లకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.