కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది. ఈ ప్రత్యేక సెషన్లో డీలిమిటేషన్ బిల్లుపై చర్చతో పాటు, మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశాల ద్వారా కీలకమైన బిల్లులపై చర్చించి, ఆమోదం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది.