చంద్రబాబు మహిళలను మోసం చేశారు: రోజా

AP: నగిరి నియోజకవర్గంలో 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి రోజా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని, మహిళలను కూడా మోసం చేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ను 'క్యాబేజీ స్టార్' అంటూ ఎద్దేవా చేసిన రోజా, సుగాలి ప్రీతి కేసులో బాధితులకు న్యాయం చేయడంలో పవన్ విఫలమయ్యారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ పాలనతో పోల్చుకుంటే ప్రస్తుత ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని ఆమె విమర్శించారు.
