AP: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులను
వైసీపీ అధినేత
జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు రైతులంటే చులకన అని, వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పొగాకు ధరల పతనానికి అధికార పార్టీ నేతలే కారణమని, మధ్యవర్తుల అవతారం ఎత్తి రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు.