AP: 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని CM చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా పర్యటించే ప్రాంతాల్లోనే ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరిస్తానని ఆయన ప్రకటించారు. అంతర్గత సర్వేలతో పాటు, పనితీరు సరిగా లేని ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తూ, ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో ప్రారంభమైంది.