AP: వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్పై చేసిన వ్యాఖ్యలు అనుచితమని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చడం సరికాదని, ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే దానిని ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ ప్లాంట్ను కాపాడటానికి ప్రయత్నించారని, కానీ చంద్రబాబు దానిని కేంద్రం చేతిలో పెట్టారని ఆరోపించారు.