AP: మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వాన్ని మరింత బలపరచాలని
టీడీపీ కార్యకర్తలు, ప్రజలకు పిలుపునిచ్చారు. నరసరావుపేటలో ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలన్నా, విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలు రక్షించబడాలన్నా, పెట్టుబడులు వచ్చి యువతకు
ఉద్యోగాలు కల్పించాలన్నా సీఎం చంద్రబాబు అధికారంలో ఉండాలి. అందుకే ప్రజలందరికీ నా పిలుపు ఒక్కటే. వన్స్ అగైన్.. అగైన్ అండ్ అగైన్.. ఎన్డీయే ఇన్ దిస్ స్టేట్ అండ్ ది కంట్రీ’ అని అన్నారు.