APలో కొత్తగా 96 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా చిత్తూరు జిల్లాలో 6 కోర్టులు రానున్నాయి. చిత్తూరులో 7వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు, మదనపల్లెలో మూడో అదనపు సివిల్ కోర్టు, పలమనేరులో మొదటి అదనపు సివిల్ కోర్టు, రెండో అదనపు సివిల్ కోర్టు, పుంగనూరులో రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు, వాయల్పాడులో మొదటి అదనపు సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు కానుంది. వీటితో కొత్త ఉద్యోగాలు వస్తాయి.