AP ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కేఎస్ జవహర్ నేటి షెడ్యూల్ను చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వెల్లడించింది. చిత్తూరు R&B అతిథి గృహంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3:30 గంటల వరకు కలెక్టరేట్లో జరిగే PGRSలో పాల్గొంటారు. అనంతరం ఎస్సీ యాక్ట్ అమలు, అభివృద్ధి, సంక్షేమంపై కలెక్టర్తో సమీక్షిస్తారు.