గూడూరు ఎస్కేఆర్ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్

976చూసినవారు
గూడూరు ఎస్కేఆర్ కళాశాలకు కొత్త ప్రిన్సిపల్
గూడూరు ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్ కె. రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో కోవూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర అధ్యాపకుడిగా, వైస్ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆయన, ఇటీవల పదోన్నతి పొంది గూడూరు కళాశాలకు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్