నగరి పట్టణంలో గంగజాతర సందడి ఆదివారం మొదలైంది. జాతర సాంప్రదాయ ఆచార వ్యవహారాల్లో భాగంగా గంగమ్మ తల్లికి
ప్రీతికరమైన గరిగ ఉత్సవాన్ని తలారి వీధి గంగమ్మ గ
ుడి వద్ద నిర్వాహకులు ప్రారంభించారు. జాతర హద్దుల్లో ఉన్న ఇళ్లకు ఊరేగింపుగా వెళ్లిన గరిగకు పసుపుకుంకుమల నీటితో హారతులు తీసి దర్శించుకున్న మహిళలు నైవేద్యం సమర్పించి బండారం స్వీకరించారు. గ
రిగ ప్రారంభోత్సవంలో జాతర నిర్వాహకులు జ్యోతిరెడ్డి,
చిరంజీవి రెడ్డి, టీకే మధన శ్రీనివాసన్, మణిగండ, శ్రీను, బాలాజి, జనార్ధన్, ప్రసాద్, సేడ్, రాజేష్, అశోక్, సునీల్, రవి, కుమార్, మహేష్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.