నిండ్ర మండలంలో భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

1242చూసినవారు
నగరి నియోజకవర్గం, నిండ్ర మండల కేంద్రంలో రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నిండ్ర పి.హెచ్.సి.లో బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (ఆసుపత్రి ల్యాబ్) కు శనివారం భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను సకాలంలో కల్పిస్తున్నారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్