గురువారం నగరి మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి అనుబంధ సంఘమైన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. పనిచేస్తూ మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు పిఎఫ్ అందలేదని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కోదండన్ కోరారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ నిరసనలో డిమాండ్ చేశారు.