శనివారం రాత్రి పూతలపట్టు పరిధిలోని పక్కాలా గుట్టలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ వేలన్కు సమాచారం అందడంతో, ఆయన ఘటనా స్థలానికి చేరుకుని చాకచక్యంగా కొండచిలువను ఒక పెద్ద సంచిలో బంధించి, కలికిరి కొండ అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.