సత్యవేడు నియోజకవర్గం, B. N. కండిగ మండలం, కనమనంబేడు గ్రామంలో
యూపీఏ హయాంలో ఏర్పాటైన ఏకలవ్య ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూల్ను కేంద్ర మాజీ మంత్రి,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ ఇవాళ ఉదయం పరిశీలించారు. పాఠశాల పనితీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు.
విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయాలని చింతామోహన్ సూచించారు.