రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రేణిగుంట ఆరోగ్య కేంద్రం హెల్త్ అసిస్టెంట్ ముని వెంకటప్ప సూచించారు. ఇళ్ల వద్ద నీరు నిల్వ ఉండకుండా, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. దోమల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని, జ్వరం వస్తే వెంటనే వైద్య
పరీక్షలు చేయించుకోవాలని హెచ్చరించారు.