శ్రీకాళహస్తి కో ఆపరేటివ్ టౌన్ బ్యాంకు వార్షిక బడ్జెట్ సమర్పణ నిమిత్తం జరిగిన మహాజన సభలో చైర్మన్ ఖాదర్ బాషా మాట్లాడుతూ, గౌరవ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆశీస్సులతో బ్యాంకు అభివృద్ధి పథంలో పయనిస్తూ లాభాల బాటలో పరుగులు తీస్తోందని తెలిపారు. సభ్యులు, ఖాతాదారుల సహకారంతోనే ఇది సాధ్యమైందని, భవిష్యత్తులోనూ వారి సహకారం కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ N గోవర్ధన్, పాలకమండలి సభ్యులు, CEO ధనంజయులు, అకౌంటెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.