మాదకద్రవ్యాల నిర్మూలనపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

1378చూసినవారు
మాదకద్రవ్యాల నిర్మూలనపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
ఏర్పేడు మండలంలోని అంజిమేడులో ఉన్న శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిత్యాదేవి ఆధ్వర్యంలో "మాదకద్రవ్యాలు మరియు గంజాయి ముప్పు" అనే అంశంపై జరిగిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం, సమాజం నుంచి ఈ ముప్పును నిర్మూలించేందుకు అవసరమైన చట్టపరమైన, సామాజిక చర్యల గురించి విద్యార్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్