శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్టాండ్లో పెరుగుతున్న ఎండలు, వేసవి ఉష్ణోగ్రతల నేపథ్యంలో సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు డిపో మేనేజర్ రేవతి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.