శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోష నంది సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా వెండి నంది వాహనంపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ఆవరణంలో ఊరేగించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.