ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగి తిరుమలేశ్ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు 11 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి, 1.47 కిలోల ఇతర విలువైన లోహాలు, రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా రెండు బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అధికారులు తెలిపారు.