తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం

953చూసినవారు
వసంత ఋతువు ప్రారంభంతో తిరుమలలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. ఉదయం వేళల్లో కొండలను పొగమంచు కమ్మేస్తుండగా, శ్రీవారి ఆలయ పరిసరాలు మేఘాల మధ్య తేలియాడుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. చల్లని గాలి, ప్రకృతి సోయగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఎండలు మొదలయ్యే కాలంలోనూ చల్లదనం కొనసాగుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సుందర వాతావరణం దర్శనార్థులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తోంది.

సంబంధిత పోస్ట్