తిరుపతిలో రీల్స్ పిచ్చి విషాదానికి దారితీసింది. సోమవారం రాత్రి అలిపిరి పీఎస్ పరిధిలోని రాజారెడ్డినగర్లోని సాయినివాస్ అపార్ట్మెంట్లో ఐదో అంతస్తులో రీల్స్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి నేపాల్కు చెందిన 13 ఏళ్ల పుష్ప అనే బాలిక మృతి చెందింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించిన బాలిక ఘటనపై ఎస్ఐ శ్రీవాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.