వెంకటగిరి జడ్పీ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్న భోజనంలో గుడ్ల పంపిణీలో భారీ వ్యత్యాసం గుర్తించి, ఏజెన్సీలు, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్కు నివేదిక ఇచ్చి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.