తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, ఆలయ పరిసరాల్లో ఫుట్పాత్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను పోలీసులు గురువారం సాయంత్రం తొలగించారు. రహదారులపై దుకాణాలు ఏర్పాటు చేయవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సునీల్కుమార్, ఎస్ఐ సాయినాథ్ చౌదరి హెచ్చరించారు.