తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల (నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు) ఏర్పాట్లపై టీటీడీ జేఈవో వీరబ్రహ్మం మంగళవారం తిరుచానూరు ఆస్థాన మండపంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, ఆయన తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఈవో మీడియాతో తెలిపారు.