తిరుపతి రూరల్ మండలంలో పి.ఎస్. మణి సోమవారం డిప్యూటీ ఎంపీడీఓ (గ్రామ సచివాలయ విభాగం)గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఇటీవల పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయ అధికారులు, పలువురు పంచాయతీ కార్యదర్శులు ఆయనను అభినందించారు.