తిరుపతిలోని ఎస్వీసీసీ డిగ్రీ కళాశాలలో మే 29న AP Skill Development Corporation ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిర్వహించబడుతోంది. SRAHP Group మేనేజింగ్ డైరెక్టర్ డా. ఆర్. శ్రవణ్ కుమార్ ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో SRAHP Groupతో పాటు 17కు పైగా మల్టీనేషనల్ కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు 800 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొని
ఉద్యోగాలు పొందవచ్చు.