చిత్తూరు పట్టణంలో మంగళవారం రాత్రి నిర్వహించే గంగ చాటును పురస్కరించుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ చాటు సందర్భంగా ఊరేగింపు సజావుగా సాగేందుకు ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.