చిత్తూరు కలెక్టరేట్ వద్దనున్న శిశువిహార్ చిన్నపిల్లల సంరక్షణ కేంద్రానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల
జగన్ మోహన్ ఆదివారం జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఏసీని వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిశు విహార్ను పరిశీలించి పిల్లల సంరక్షణ, ఇతర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.