చిత్తూరు నగరంలో శుక్రవారం గాంధీ విగ్రహం కూడలిలో ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం చట్టబద్ధం అనుకోవద్దని, అది వ్యక్తిగత బాధ్యతగా భావించాలని ఆయన సూచించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనదారులు అధిక వేగంతో ప్రయాణిస్తున్నారని, ప్రమాదాలు జరిగితే కుటుంబ సభ్యులను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.