స్వచ్ఛ సర్వేక్షణ్-2026 సర్వేలో 'మన నగరం- చిత్తూరు'కు ఓటేయాలని కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్, కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో స్వచ్ఛసర్వేక్షణ్ ఓటింగ్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ప్రజాభిప్రాయ సర్వేలో నగర ప్రజలు చురుగ్గా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకోవాలని, ఓటింగ్లో పాల్గొనే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.