డిప్యూటీ సీఎం, అటవీశాఖమంత్రి పవన్కల్యాణ్ 7, 8 తేదీలలో మామండూరు, పలమనేరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రచందనం గోదామును పరిశీలించడంతో పాటు, ఎర్రచందనం సంరక్షణపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ పర్యటన ద్వారా అటవీ సంరక్షణ చర్యలపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంది.