చిత్తూరు ఎన్ ఆర్ పేట పోలీస్ స్టేషన్ ను బుధవారం డీఎస్పీ వెంకటనారాయణ తనిఖీ చేశారు. మహిళలు, సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచాలని సిబ్బందికి ఆయన సూచించారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. పలు రికార్డులను, స్టేషన్ పరిసరాలను ఆయన పరిశీలించారు.