మంగళవారం పాలసముద్రం మండలం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించిన ఆయన, వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను ప్రభుత్వ విప్ ఆదేశించారు.