కార్వేటినగరం మండలంలోని బాలికలు, యువతులు, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఐ తేజస్విని తెలిపారు. మంగళవారం రాత్రి ఐసిడిఎస్ అధికారులతో కలిసి ఎస్సై గ్రామాల్లోని మహిళలకు భద్రత, స్వీయ రక్షణపై అవగాహన కల్పించారు. గ్రామీణ మహిళల సహకారంతో పోలీసులకు సమాచారం రాబట్టడం సులభతరం అవుతుందని, మహిళల రక్షణ పోలీసుల కర్తవ్యమని, బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.