శనివారం రాత్రి కార్వేటి నగరం మండల కేంద్రంలోని బంట్రేవు కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ సాంబశివ ఆచారి మృతి చెందారు. మహా న్యూస్ రిపోర్టర్ మోహన్ దాస్ తీవ్ర గాయాలతో తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిద్దరూ వేణుగోపాల స్వామిని దర్శించుకుని స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.