జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలంలో అప్పుల బాధతో వెంకటేశులు రాజు అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో పని చేస్తూ వ్యవసాయం చేసుకుంటున్న ఆయన, దిగుబడి సరిగా రాక అప్పుల భారంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వేలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.