వైసీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృపా లక్ష్మీ, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామితో కలిసి ఎస్ఆర్ పురంలో గురువారం నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వెన్నుపోటు పొడిచిందని, అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని ఆమె విమర్శించారు. రెండేళ్లుగా ప్రజలకు కూటమి ప్రభుత్వ పాలనలో ఒరిగిందేమీ లేదని, జగనన్న పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.