కుప్పం: కాలువ నిర్మాణ పనులు ప్రారంభం

5చూసినవారు
కుప్పం: కాలువ నిర్మాణ పనులు ప్రారంభం
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో రాజు కాలవ నిర్మాణ పనులను ఎమ్మెల్సీ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు. పాత కాలువను తొలగించి నూతనంగా నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు రూ. 100 కోట్లను కేటాయించారని వెల్లడించారు. అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీఎంకె ఉడా ఛైర్మన్ సురేష్ బాబు, మునిసిపల్ చైర్మన్ సెల్వరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్