చిత్తూరు జిల్లా కుప్పం మండలం పెద్ద గోపనపల్లి వద్ద అశోకపురం ఎక్స్ప్రెస్ రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని 18 ఏళ్ల యువతి మృతి చెందినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడడంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువతి వివరాలు తెలిసిన వారు 9000716436, 8074088806 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.